App

మీ పొలం కోసం వాతావరణ-ఆధారిత మరియు భూపరీక్ష-ఆధారిత వ్యక్తిగతీకరించిన సలహా భూమి తయారీ నుండి కోత వరకు పూర్తి కార్యాచరణ జాబితాను అందిస్తుంది. మా సలహా వ్యవసాయ దిగుబడిని మెరుగుపరచడంలో సహాయపడే సాంకేతికత మరియు అనుభవాల కలయిక.

మా సలహా వ్యవసాయ దిగుబడిని మెరుగుపరచడంలో సహాయపడే సాంకేతికత మరియు అనుభవాల కలయిక.

మీ తాలూకా, పంట, సీజన్, వ్యవసాయ పరిమాణం, నాట్లు వేయు పదార్థం, విత్తే తేదీ మరియు మీ పొలం మరియు పంటకు తగిన ఖచ్చితమైన శాస్త్రీయ క్యాలెండర్‌ను సృష్టించే వివిధ ప్రమాణాల ఆధారంగా క్యాలెండర్ ప్రతి పొలానికి వ్యక్తిగతీకరించబడుతుంది.

భూమి తయారీ, విత్తన శుద్ధి, విత్తడం, పంట ప్రణాళిక, ఎరువుల నిర్వహణ, నీటిపారుదల, సమగ్ర పోషక నిర్వహణ, తెగుళ్ల నుంచి రక్షణ, వ్యాధులు, కలుపు మొక్కలు, పంటల పెరుగుదల మరియు కోతల యొక్క అన్ని కార్యకలాపాలు ఈ పూర్తి సలహాలో ఉన్నాయి.

App

వారి పంటలను ప్రభావితం చేసే చీడలు మరియు వ్యాధులను గుర్తించడంలో ఎదురయ్యే సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారతీయ రైత్లులను శక్తిమంతం చేసేందుకు క్రిష్-e కృషి చేస్తోంది.

"మీ పంటను ఏ తెగుళ్ళు మరియు వ్యాధులు ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పంట ఏ పోషక లోపంతో బాధపడుతోంది? మీ పంట యొక్క చిత్రాన్ని అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ సమస్యలన్నింటికీ తక్షణ పరిష్కారం పొందండి. క్రిష్-e నిదాన్ మీ పంటలకు సరైన ఆరోగ్య భాగస్వామి మరియు మీకు సరైన రోగ నిర్ధారణ మరియు శాస్త్రీయ పరిష్కారాలను అందిస్తుంది. తెగుళ్ళు మరియు వ్యాధులను సకాలంలో గుర్తించడం ద్వారా మీ పంట ఉత్పాదకతను పెంచుకోండి.

పంటలను ప్రభావితం చేసే తెగులు మరియు వ్యాధుల గుర్తింపు కోసం వారి సవాళ్లను పరిష్కరించడంలో భారతీయ రైతులను శక్తివంతం చేయడమే మహీంద్రా గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. క్రిష్-e నిదాన్ అనేది మా యాజమాన్య అల్గోరిథంలు మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై నడిచే ఉపయోగకరమైన సాధనం, ఇది రైతులకు మొక్కల వ్యాధిని నిర్ధారించడానికి మరియు ఫోటోను సమర్పించడం ద్వారా తక్షణ పరిష్కారాన్ని పొందటానికి సహాయపడుతుంది."

 Rental Partner App
Krishe Rental App

క్రిష్-e రెంటల్ యాప్‌తో రైతులు తమ వీలు ప్రకారం వ్యవసాయ పనిముట్లను అద్దెకు ఇచ్చేలా బుక్ చేసుకోవచ్చు.

"క్రిష్-e అద్దె అనేది రైతులకు ఆన్-డిమాండ్ వ్యవసాయ పరికరాల అద్దె వేదిక. రైతులు ఆధునిక వ్యవసాయ పరికరాలను క్రిష్-e నుండి యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు మరియు ప్రతి ఉపయోగానికి చెల్లించవచ్చు. సర్వీస్ అందించబడుతున్న గ్రామాలలో వ్యవసాయ పనిముట్లు క్రిష్-e రెంటల్ ఎంట్రపెన్యూర్లనుండి లేదా క్రిష్-e డీలర్ల నుండి వస్తాయి. క్రిష్-e సకాలంలో మరియు అధిక-నాణ్యమైన సేవలను, సరసమైన ధరలకు విస్తృత శ్రేణి పరికరాలకు ప్రాప్యతను అందిస్తుంది. చిన్న నుండి పెద్ద భూవిస్తీర్ణం ఉన్న రైతులు ఇప్పుడు లైవ్ ట్రాకింగ్ మరియు సపోర్ట్‌ను అందించే టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ మద్దతుతో హామీతో కూడిన సేవ నుండి ప్రయోజనం పొందవచ్చు.

రైతులు తమ ప్రాంతంలో కొత్త పరికరాలను వాటి ధరలతో పాటు బ్రౌజ్ చేయవచ్చు మరియు కనుగొనవచ్చు. ఇతర లక్షణాలలో సమాజంలోని ఇతర రైతుల కోసం బుకింగ్ చేయడం మరియు బహుళ వ్యవసాయ భూములను నిర్వహించడం."

మీ పొలాలలో ఇ-విప్లవాన్ని ఆస్వాదించడానికి వ్యవసాయానికి క్రిష్-e వే ను పొందండి! మా మాట్లాడటానికి 1800-266-1555కు కాల్ చేసి బుకింగ్ చేసుకోండి.

క్రిష్-e తో పెరగడం

క్రిష్-e మిలియన్లకొద్దీ విజేతలైన రైతులను తయారుచేసే నూతన శకానికి నాంది పలికింది

భారతీయ వ్యవసాయ రంగంలో మార్పులు తేవడంద్వారా, మిలియన్లకొద్దీ రైతులు తమ పంట క్షేత్రంనుండి ఉత్తమ ఉత్పాదన, లాభాలు అందించడమే లక్ష్యంగా క్రిష్-e ముందుకు వెళుతోంది.

కైలాస్ మోరె గ్రామం - పూరీ

జిల్లా - ఔరంగాబాద్

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన శ్రీ కైలాస్ మోరె, క్రిష్-e టక్నీక్ ప్లాట్ రైతు. 8 నెలల క్రితం, ఈయన తన పంటకు క్రిష్-e చెరకు డిజిటల్ కేలండర్ తీసుకొన్నాడు. క్రిష్-e అడ్వైజరీ మరియు యాప్ మద్దతు తీసుకొన్నాడు, ప్రస్తుతం ఆయన చెరకు పంట కాండం పరిమాణం 7.5 అంగుళాలు మరియు చుట్టుకొలత 3.5 అంగుళాలు ఉంది. ఇది స్థలం తయారీ, విత్తనాల ఎంపిక, విత్తనాల శుద్ధి, మరెన్నో ఉండే చక్కని పంట యాజమాన్యానికి సూచనలుగా చెప్పవచ్చు, దీనివల్ల ఆయనకు గత సంవత్సరంతో పోలిస్తే, ఖర్చులో దాదాపు 12% వరకు ఆదా అయింది.

అంకుష్ డాడ్మైస్ గ్రామం - సదోబచ్చివాడి బారామతి

జిల్లా - పూనె

పూనెలోని సదోబచ్చివాడి బారామతి గ్రామానికి చెందిన శ్రీ అంకుష్ డాడ్మైస్, ఇప్పుడే అభివృద్ధిలోకి వస్తున్న ఒక రైతు, ఈయన తన పంటలను రక్షించుకొనేందుకు క్రిష్-e చక్కెర డిజిటల్ అడ్వైజరీని ఉపయోగించుకొన్నారు. ఈయన మేము వివిధ సమయాలలో చేసే స్థలం తయారీ, విత్తనాల ఎంపిక, విత్తనాల శుద్ధి, సేంద్రీయ + ఫాస్ఫారిక్ ఆమ్లాలను తిరిగి వినియోగించే అన్ని పనులు చేశారు. ఈ విధానాల సహాయంతో ప్రస్తుతం ఆయన చెప్పుకోదగిన సంఖ్యలో టిల్లర్లను అంటే సుమారుగా 7-8 ఉపయోగిస్తున్నారు, దీనివల్ల ఆయన 80% వరకు మొలకలు పొందగలుగుతున్నారు.

దారా ప్రతాప్ సింగ్ రఘుబన్షీ గ్రామం - గ్రేటియా

జిల్లా - ఛింద్వారా

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో ఉన్న గ్రేటియా తెహ్‌సీల్-చౌరాయ్ గ్రామానికి చెందిన శ్రీ దారా ప్రతాప్ సింగ్ రఘుబన్షీ, సంస్కరణలను స్వాగతించే ఒకరైతు, ఈయన క్రిష్-e బృందం సహాయంతో యాంత్రికీకరణ విధానాలను అమలు పరచాడు. న్యూమటిక్ ప్లాంటర్స్ ఉపయోగించడం వల్ల బాగా లోతుగా విత్తనం వేయడం, విత్తనానికి, విత్తనానికి మధ్య మరియు వరుస, వరుసల మధ్య సరైన దూరం ఉంచడం సాధ్యమయింది. దీనివల్ల మొక్కలు సమానంగా చిగురించి, హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాల ఉత్పత్తికి అయ్యే ఖర్చు తగ్గింది.

హేమంత్ వర్మ గ్రామం - హతోడ

జిల్లా - ఛింద్వారా

హేమంత్ వర్మను కలుద్దాం. మధ్యప్రదేశ్‌లోని హతోడ గ్రామానికి చెందిన ఈయన పెరుగుదలపై దృష్టి ఎక్కువగా నిలిపే రైతు. క్రిష్-e బృందం అందించిన సహాయం మరియు మార్గదర్శత్వంలో ఆయన, స్థల తయారీ మరియు పంట దిగుబడి వంటి వాటిలో క్రిష్-e వ్యవసాయ విధానాలను అమలు పరచారు. ఈ విధానాలను ఉపయోగించడం వల్ల ఆయన పంటలు విశేషంగా పెరిగి, గత సంవత్సరంతో పోల్చిచూస్తే అధిక దిబుబడి వచ్చే అవకాశం ఉంది.

మనోజ్‌భాయ్ గణేష్‌భాయ్ భేసదాడియా గ్రామం - మోతీ బనుగర్

జిల్లా - జామ్ నగర్

ఆరంభంలో మనోజ్‌భాయ్ గణేష్‌భాయ్ భేసదాడియా సంప్రదాయ విధానాలను ఉపయోగించి పంటపొలాలను సాగు చేయడం, వరదనీటితో సాగు వంటి విధానాలు అమలుపరచేవారు, అంతేగాక, రసాయన ఎరువుల వినియోగంపై నియంత్రణ లేకపోవడం వల్ల పంటసాగుకు అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉండేది. కాని కొత్తదాన్ని ఆహ్వానించాలన్న ఆయన ఆలోచనావిధానం మరియు నూతన మరియు సృజనాత్మక విధానాలను నేర్చుకోవాలన్న ఆలోచన, పరిస్థితులను ఆయనకు అనుగుణంగా మార్చాయి. క్రిష్-e బృందం సహాయం మరియు మార్గదర్శకాలవల్ల ప్రస్తుతం ఆయన ఎంఐఎస్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని, క్రిష్-e సహకారంతో కెవికె పంట రక్షణ బృందం అందిందిన వ్యవసాయ సేవల ఆధారంగా పత్తిని సాగుచేస్తున్నారు.

రమేష్‌భాయ్ గోర్థన్‌భాయ్ చొవాటియా గ్రామం - మోటా తవారియా

జిల్లా - జామ్ నగర్

సంప్రదాయ విధానాలు మరియు నీటిసాగు విధానాలు అమలు పరచడం వల్ల శ్రీ రమేష్‌భాయ్ గోర్థన్‌భాయ్ చొవాటియాకు ఉపయోగించే రసాయన ఎరువులకు అయ్యే ఖర్చు విపరీతంగా ఉండి తద్వారా, పంట సాగు ఖర్చు అధికంగా ఉండేది. అంతేగాక, వర్షాభావ పరిస్థితులు, నీటివనరులు సరిగా లేకపోవడం వల్ల పత్తి దిగుబడి ఆయన అనుకొన్నదానికంటే తక్కువగా ఉండేది. పత్తి పంటలను ఎలా సాగుచేయాలి అనే వాటిగురించి స్పష్టమైన అవగాహన, వివిధ రసాయన మరియు నీటిలో కరిగే ఎరువులను ఎలా వినియోగించాలి అన్నదాన్ని తెలుసుకోవడం, తరచు క్రిష్-e బృందం జరిపే క్షేత్ర సందర్శన వల్ల, ప్రస్తుతం పత్తిసాగుతో, ఆయన పెట్టుబడికి వస్తున్న ఆదాయంతో ఆయన సంతోషంగా ఉన్నారు.

పేనుగంటి పాపారావు గ్రామం - ఎండగంటి

జిల్లా - పశ్చిమ గోదావరి

ఆంద్రప్రదేశ్‌, ఎండగంటి గ్రామానికి చెందిన శ్రీ పేనుగంటి పాపారావు, ఆధునిక వ్యవసాయ విధానాలను ఉపయోగించి, అభివృద్ధి చేపట్టాలన్న దృక్పథం కలిగివున్న ఒక ఆధునిక రైతు. క్రిష్-e బృందం సహాయంతో, ఆయన తన క్షేత్రంలో యాంత్రికీకరించిన వరి నాటే విధానాన్ని అమలుపరచడంతోపాటు, మాట్ నర్సరీ కూడా చేపట్టారు. ఫలితం – ఉత్పాదన 3525 కిలో/ఎకరాలు లనుండి 3750 కిలో/ఎకరాలుకు పెరిగింది.